అర్వపల్లి, ఫిబ్రవరి 5 : అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కల్యాణ మహోత్సవానికి ఆదివారం ప్రభు త్వం తరఫున ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్-కమల, జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపికాయుగంధర్రావు దంపతులు పట్టు వస్ర్తాలు,ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అనంతరం వారు దేవాలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
ఎమ్మెల్యే దంపతులు, జడ్పీ చైర్పర్సన్ దంపతులను జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్-మనీషా దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్ ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు రాంబాబు నూతన వస్ర్తాలను అందజేశారు. అర్ధరాత్రి స్వామివారి కల్యాణం ఘ నంగా జరుగనుంది. భక్తులకు అన్నదానం చేశారు.ఎంపీపీ మన్నె రేణుక, సర్పంచ్ సునీతారామలింగయ్య, ఎంపీటీసీ పద్మాశ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమేశ్గౌడ్, ఉపేందర్,రామలింగయ్య,ప్రభాకర్, నరేశ్, రాజలింగం, ఉషయ్య, భ క్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.