యాదగిరిగుట్ట, మార్చి 2: యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారికి సుప్రభాత సేవ వైభవంగా నిర్వహించారు. గురువారం తెల్లవారు జామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు నారసింహస్వామివారికి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ అర్చకులు అలకించి స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. శ్రీ స్వామివారికి నిజాభిషేకం, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా సాగింది. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజల వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. స్వామివారిని సుమారు 16 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకుని శ్రీస్వామివారి ఖజానాకు రూ. 23,53,085 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన స్వామివారి చక్రతీర్థ మహోత్సవం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 49,000
వీఐపీ దర్శనాలు 30,000
బ్రేక్ దర్శనాలు 1,02,300
వేద ఆశీర్వచనం 12,000
ప్రచార శాఖ 14,500
వ్రత పూజలు 1,10,400
కల్యాణకట్ట టిక్కెట్లు 65,000
ప్రసాద విక్రయం 10,15,140
వాహన పూజలు 15,000
అన్నదాన విరాళం 14,069
శాశ్వత పూజలు 5,000
సువర్ణ పుష్పార్చన 88,800
యాదరుషి నిలయం 63,976
పాతగుట్ట నుంచి 33,090
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
శివాలయం 4,000
పుష్కరిణి 1,250
ఇతర విభాగాలు 5,29,560