యాదాద్రి, డిసెంబర్14: ప్రొటోకాల్పై మాట్లాడే అర్హత ఎంపీపీ శ్రీశైలం, వంగపల్లి సర్పంచ్ కానుగు కవితకు లేదని గ్రామ ఉప సర్పంచ్ రేపాక స్వామి, ఎంపీటీసీ రేపాక మౌనిక అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచి మంత్రి హోదాలో ఉన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి సమాచారం ఇవ్వకుండా గ్రామంలో పాఠశాలలో అభివృద్ధి పనులు, చిన్నకందుకూరులో బతుకమ్మ చీరెల పంపిణీని ఎంపీతో ప్రారంభించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 12 మంది గ్రామపంచాయతీ వార్డు సభ్యులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీపీ, సర్పంచ్ తీరుపై మండిపడ్డారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డికి ప్రొటోకాల్ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. వంగపల్లి సర్పంచ్గా కానుగు కవిత ఎన్నికైన నాటి నుంచి ఆమె భర్త కానుగు బాలరాజు సర్పంచ్గా వ్యవహరిస్తూ గ్రామ పంచాయతీ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.
పంచాయతీలో 12 మంది వార్డులను ఇబ్బందికి గురిచేస్తున్నారని, వారి వార్డుల్లో పనులకు సైతం సహకరించడం లేదని వాపోయారు. ప్రభుత్వ విప్ గొంగిడి దంపతులు 8 ఏండ్లలో తమ సొంత గ్రామమైన వంగపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. నూతన గ్రామ పంచాయతీ భవనం, విద్యుత్ సబ్ స్టేషన్, రూ. కోటితో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, సుమారు 800మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు గుర్తు చేశారు. గ్రామంలో రైతువేదిక, వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణాలు ప్రభుత్వ విప్ కృషితోనే సాధ్యమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రజలకం దించే బాధ్యత ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై ఉందన్నారు. ఆరోపణలు మానుకోకపోతే ఊరుకోమని హెచ్చరించారు. సమావే శంలో వార్డు సభ్యులు కానుగు సంధ్యారాజు, ఆకుల సంతోష, కానుగు పద్మ, రజినీ, గవ్వల సిద్ధులు, ఎడపెల్లి వెంకటేశ్, ఆంజనేయులు, గాయత్రిమహేశ్, బండి మహేశ్, కవితావెంకటేశ్, రాణాప్రతాప్ పాల్గొన్నారు.