మోటకొండూర్, సెప్టెంబర్ 20 : టీఆర్ఎస్ పార్టీకి యువతే బలమని, పార్టీ బలోపేతానికి యువత సైనికుల్లా పనిచేయాలని టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు బీస కృష్ణంరాజు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండలానికి చెందిన టీఆర్ఎస్వై, టీఆర్ఎస్వీ, సోషల్ మీడియా ప్రతినిధులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుధవారం తుర్కపల్లిలో జరుగనున్న టీఆర్ఎస్ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశానికి మోటకొండూర్ మండల టీఆర్ఎస్ యువత భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు భూమండ్ల సుధీర్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బురాన్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ పన్నీరు భరత్, యూత్ మండల సెక్రటరీ జనరల్ పన్నాల నవీన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి యంపల్ల సునీల్రెడ్డి, మాజీ సెక్రటరీ జనరల్ నర్సింహులుయాదవ్, పాల సంఘం చైర్మన్ కొల్లూరి మల్లేశ్మిత్ర, నాయకులు శ్రీకాంత్, మహేశ్, మధు, వెంకటేశ్, మధు, వీరనర్సింహ, కృష్ణ, శ్రీనివాస్, జహంగీర్ పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించనున్న టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై, సోషల్ మీడియా మండల స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమావేశానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిషాంక్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్చౌదరి హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థి, యువజన, సోషల్ మీడియా విభాగాల నాయకులు తరలిరావాలన్నారు.
బొమ్మలరామారం : తుర్కపల్లిలో బుధవారం జరుగనున్న టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై, సోషల్ మీడియా సమావేశానికి యువత అధికసంఖ్యలో హాజరై వియజవంతం చేయాలని టీఆర్ఎస్ మండల యూత్ విభాగం అధ్యక్షుడు బట్కీర్ బీరప్ప, సోషల్ మీడియా కన్వీనర్ కొండ్రా సాయికుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని నాగినేనిపల్లిలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు బాల్సింగ్, కార్యదర్శి రాజుయాదవ్, అనిల్కుమార్, సుమన్నాయక్, రమేశ్గౌడ్, మోహన్నాయక్, పరమేశ్, సురేశ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : తుర్కపల్లిలో బుధవారం జరుగనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మండల వ్యాప్తంగా విద్యార్థి, యువజన, సోషల్ మీడియా కమిటీల బాధ్యులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.