రామన్నపేట, జూన్13: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చూసి దేశ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని నిదానపల్లి, నీర్నెంముల గ్రామాల్లో రూ.50 లక్షల సీడీఎఫ్ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులను, మండల కేంద్రంలోని సంజీవయ్యనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.42 లక్షలతో మన ఊరు-మనబడి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేసి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పని చేసి ధైర్యంగా ఓట్లు అడుగుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలు సృష్టించి రాష్ర్టాన్ని రావణ కాష్టంగా మార్చి లబ్ధి పొందాలని చూస్తున్నదని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడిలా మారారని కొనియాడారు.
కార్యక్రమాల్లో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుత్తా నర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు తిమ్మాపురం మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సర్పంచులు ముత్యాల సుజా త, మెట్టు మహేందర్రెడ్డి, ఉప్పు ప్రకాశ్, ఎంపీటీసీలు గోగు పద్మ, గొరిగె నర్సింహ, వనం హర్షి ని, దోమల సతీశ్, ఎండీ ఆమేర్, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, మండల విద్యాధికారి శ్రీధర్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి పోచబోయిన మల్లేశం, పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు మీర్జా ఇనాయతుల్లాబేగ్, సంతోష్, యూత్ మండలాధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు.