భువనగిరి అర్బన్, జూన్ 13: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుంతుందని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని బస్వాపురం, అనంతారం గ్రామాల్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నదన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, తరగతి గదులు, వంట గది, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ అన్ని వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. పల్లెప్రగతిలో కొనసాగుతున్న పారిశుధ్య పనులు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ బీరు మల్లయ్య, ఎంపీడీఓ నరేందర్రెడ్డి, మండల వైద్యాధికారి శోభ, సర్పంచులు మల్లికార్జున్, మంజుల, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
బీబీనగర్లో…
బీబీనగర్ : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జడ్పీ స్థాయీ సంఘం చైర్మన్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేం ద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్ను లను అందజేసి మాట్లాడారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు మంచి విద్య అందించేందుకు కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దస్తగిరి, కార్యదర్శి బాలాచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో…
యాదగిరిగుట్ట రూరల్ : వేసవి సెలవుల అనంతరం మండలవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమ య్యా యి. యాదగిరిగుట్ట మండలంలో మొత్తం 36 పాఠశాలలున్నాయి. ఇందులో హైస్కూల్, 27 ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరైనట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
రాజాపేటలో…
రాజాపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించడంతో విద్యార్థులు హాజరు శాతం పెరిగిందని ఎంఈఓ కృష్ణ తెలిపారు.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం) : పాఠశాలల సెలవులు ముగిసి 50 రోజుల తర్వాత సోమవారం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బడిగంట మోగింది. పాఠశాలల్లో మామిడి తోరణాలు కట్టి, ముగ్గులు వేసి పువ్వులతో అలంకరించారు.
సంస్థాన్ నారాయణపురంలో…
సంస్థాన్నారాయణపురం : ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని నారాయణపురం సర్పంచ్ శ్రీహరి తల్లిదండ్రులను కోరారు. వేసవి సెలవులు ముగిసి సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో సర్పంచ్ శ్రీహరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిం చారు. విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ దూసరి వెంకటేశ్, నాయకులు భిక్షం, సతీశ్కుమార్, ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.