రామగిరి, జూన్ 13: వేసవి సెలవుల తర్వాత సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బడి గంట మోగింది. పిల్లలంతా బడిబాట పట్టారు. నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఆంగ్లమాధ్యమంలో బోధిస్తున్నట్లు తల్లిదండ్రులకు వివరిస్తూ ఉపాధ్యాయులు అంతటా బడిబాట ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. డీఈఓలు ఆయా జిల్లాలో పలు పాఠశాలలను సందర్శించారు.
తొలి రోజు 6,885 మంది పిల్లల చేరిక..
పాఠశాలల ప్రారంభం రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,885 మంది విద్యార్థులకు నూతనంగా అడ్మిషన్లు కల్పించారు. నల్లగొండ జిల్లాలో 1502, సూర్యాపేట జిల్లాలో 1819, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3,564 మంది పిల్లలు చేరారు. వీరిలో అధికశాతం అంగన్వాడీ, ప్రైవేట్పాఠశాలల నుంచి చేరినట్లు తెలిపారు.
కొండమల్లేపల్లి : జడ్పీహెచ్ఎస్లో తొలి రోజు100 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రధానోపాధ్యాయుడు మంద సత్యనారాయణతెలిపారు. విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలకు రావాలని ప్రధానోపాధ్యాయులు
విద్యార్థులకు సూచిస్తున్నారు.
తిప్పర్తి : మండలంలోని అన్ని పాఠశాలల్లో తొలిరోజు 1000 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఈఓ నర్సింహ తెలిపారు.