కట్టంగూర్, జూన్ 6 : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని మునుకుంట్ల గ్రామంలో రూ.30లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ‘బడి బాట’లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షర్యాభ్యాసం చేయిం చారు. అనంతరం జరిగిన గ్రామసభలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలో నెంబర్వన్గా నిలిచిందన్నారు. పల్లెప్రగతిలో ప్రజలంతా భాగ స్వాములు కావాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపైసా గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పొరెళ్ల సునీత, వైస్ ఎంపీపీ కోటిరెడ్డి, ఎంపీఓ ఆర్థర్ పర్వేజ్, ఉప సర్పంచ్ రేణుక, పీఆర్ ఏఈ జలీల్, ట్రాన్స్కో ఏఈ సురేశ్, ఏపీఓ రాంమో హన్, ఏపీఎం వినోద, ఏఓ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏడుకొండలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన
మునుగోడు : మండలంలోని జక్కలివారిగూడెంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను డీఆర్డీఓ కాళిందిని సోమవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీపీ కర్నాటి స్వామి, ఎంపీడీఓ యాకూబ్నాయక్, మండల ప్రత్యేకాధికారి ప్రసాద్, ఎంపీఓ సుమలత, సర్పంచ్ జక్కలి శ్రీను ఉన్నారు.
గ్రామాల అభివృద్ధికి సహకరించాలి : ఎంపీపీ శ్వేత
గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని ఎస్డబ్ల్యూ లింగోటం, వడ్డపల్లి, నాంపల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలలను వారు సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని కంపోస్టు షెడ్డులో ఎరువుల తయారీ గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషుకుమార్, తాసీల్దార్ లాల్బహుదూర్, సర్పంచ్ కుంభం విజయ, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఎండీ.సత్తార్, కోన్రెడ్డి కొండల్, పెద్దిరెడ్డి రాజశేఖర్రెడ్డి, కర్నె యాదయ్య, గౌరు కిరణ్, పంగ కొండయ్య పాల్గొన్నారు.