వలిగొండ : అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని సీజ్ చేసి గోవులను గోశాలకు తరలించిన ఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి విధి నిర్వాహణలో భాగంగా స్థానిక పోలీసులు డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 41 ఆవులు, 17 ఎద్దులు ఉన్నాయి. డీసీఎం వాహనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి గోవులను అక్రమంగా హైదరాబాద్ కబేలకు తరలిస్తున్నారని, వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకొని గోవులను రాజపేట మండలంలోని గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్గౌడ్ తెలిపారు.