కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఆయన ప్రసంగించే సమయానికి సభలకు వచ్చిన మెజార్టీ ప్రజలు తిరిగి ఇండ్లకు చేరకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు ఇలా కొద్ది మందితోనే రేవంత్రెడ్డి సభలు కొనసాగాయి. రేవంత్ ప్రసంగించే సమయంలో నకిరేకల్, తిరుమలగిరి, యాదగిరిగుట్ట సభా ప్రాంగణాల్లో దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీల ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. రేవంత్రెడ్డి మీటింగ్ పెట్టి నెగెటివ్ ప్రచారానికి ఆస్కారం ఇచ్చినైట్లెందన్న చర్చ ఆ పార్టీలో మొదలైంది.
ఇప్పటికే ఈ నెల 22న నల్లగొండలో ఖాళీ కుర్చీలతో జరిగిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీటింగ్తో నెగెటివ్ టాక్ నడుస్తుండగా ఇప్పుడు రేవంత్రెడ్డి మీటింగ్లు దానికి తోడయ్యాయన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉంటే ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డి వంటి నేతలకు రేవంత్రెడ్డి జిల్లా పర్యటన ఇష్టం లేదని సమాచారం. కానీ నల్లగొండలో సభల పేరుతో అడుగుపెట్టి వాళ్లపై పైచేయి సాధించానని చాటుకోవడం కోసమే రేవంత్రెడ్డి పట్టుబట్టి జిల్లా పర్యటనకు వచ్చినట్లు మరో చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నది. అందుకే ఐదారు గంటలు ఆలస్యమైనా సరే రేవంత్రెడ్డి సభలకు హాజరవడం గమనార్హం.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్24(నమస్తే తెలంగాణ). ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోజరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే వాస్తవంగా రేవంత్రెడ్డి హెలికాప్టర్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని సభల్లో పాల్గొనాల్సి ఉంది. వాతావరణం అనుకూలిం చకపోవడంతో హెలికాప్టర్లో రావడం సాధ్యం కాలేదు. హెలి కాప్టర్లో పర్యటనకు అనుకూలంగా లేకపోయినా జిల్లా సీనియర్లను కాదని నల్లగొండలో అడుగుపెట్టాలన్న ఛాలెంజ్తో రోడ్డు మార్గంలో బయల్దేరి వచ్చారు. అన్ని చోట్ల కూడా రేవంత్రెడ్డి పర్యటన ఐదు నుంచి ఆరు గంటల ఆలస్యంగా కొనసాగింది. దాంతో ఆయన ప్రసంగించే సమయానికి అన్ని చోట్ల మెజార్టీగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి.
నకిరేకల్లోని ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన సభ కోసం వచ్చిన జనం రెండు గంటల వరకు కూడా రేవంత్రెడ్డి అడ్రస్ లేకపోవడంతో తిరుగుముఖం పట్టారు. వచ్చిన వాహనాలన్నీ తిరిగి ఊర్ల బాట పట్టాయి. తర్వాత సాయంత్రం 4 గంటలకు వస్తాడని చెప్పి జనాన్ని పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే విసిగిపోయిన జనం తమను తీసుకువచ్చిన వాహనాల్లో ఇంటిబాట పట్టారు. తీరా సాయంత్రం 4.47గంటలకు రేవంత్రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకునే సరికి మెజార్టీ భాగం వెళ్లిపోయారు. తర్వాత తుంగతుర్తి నియోజకవర్గ సభ తిరమలగిరిలో మధ్యాహ్నం ఒంటి గంటకు జరగాల్సి ఉంది. ఈ సభకు రేవంత్రెడ్డి సాయంత్రం ఆరు గంటలకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ కోసం వచ్చిన జనం అంతసేపు వేచి చూడలేక వెళ్లిపోయారు. దాంతో రేవంత్రెడ్డి వచ్చే సమయానికి సభలో పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులే సభలో కనిపించారు.
ఆలేరు నియోజకవర్గ సభ మధ్యాహ్నం 2 గంటలకు అని చెప్పి సాయంత్రం ఏడు గంటల వరకు రేవంత్రెడ్డి అడ్రస్ లేరు. దాంతో జనం ఐదు గంటల వరకే మెజార్టీ భాగం వెళ్లిపోయారు. అయినా సరే సాయంత్రం 7.56 గంటలకు రేవంత్రెడ్డి ఆలేరుకు చేరుకున్నారు. దాంతో ఇక్కడ ఖాళీ కుర్చీలతోనే రేవంత్రెడ్డి తన ఉపన్యాసం కొనసాగించాల్సి వచ్చింది. ఇక అన్ని చోట్లా సభలకు వచ్చిన జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కనిపించారు. డబ్బులు ఇస్తామని సభలకు తీసుకొచ్చి… నాలుగైదు గంటల పాటు ఎదురుచూసేలా చేశారని తిట్టుకున్నారు. సభ ఎప్పుడో అని చెప్పి ఐదారు గంటల ఆలస్యంగా రావడం ఏంటీ… రేవంత్రెడ్డి తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తున్నామని చెప్పి రేవంత్రెడ్డి వచ్చే వరకు అక్కడే ఉండాలని బలవంతం చేయడమేంటని అన్ని చోట్ల కామన్ చర్చ వినవచ్చింది. జనం ఓపికను పరీక్షించేలా సాగిన రేవంత్రెడ్డి పర్యటన అభ్యర్థ్ధులకు ఎంత మంచి చేస్తుందో లేదో కానీ… ప్రజల్లో మాత్రం లేని వ్యతిరేకతను తెచ్చిపెట్టుకున్నైట్లెందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతుండడం విశేషం.
నకిరేకల్ : నకిరేకల్ మినీస్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా భరోసా సభ అట్టర్ ప్లాప్ అయింది. సభకు విచ్చేసిన ప్రజలు వచ్చినట్లుగానే వెళ్లిపోతున్న జనాన్ని ఆపేందుకు కాంగ్రెస్ నాయకులు నానా తంటాలు పడాల్సివచ్చింది. కుర్చీల్లో కూర్చోవాలని పదే పదే మైకులో చెప్పినా ప్రజలు వినకుండా వెళ్లిపోయారు. దాదాపు ఉదయం 10 నుంచి 12 గంటల ప్రాంతంలో సభాస్థలికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు 2.00లకే వెనుదిరిగి ఇంటిబాట పట్టడం పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. రేవంత్రెడ్డి మధ్యాహ్నం 2.00 గంటలకు సభకు హాజరుకావాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల వల్ల హెలికాప్టర్ అంతరాయం ఏర్పడింది. దాంతో 2.00 గంటలకు వరకు ఓపిక పట్టిన కాంగ్రెస్ శ్రేణులు ఇంటి బాట పట్టారు.
రెండో షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి 4.00 గంటలకు నకిరేకల్ చేరుకోవాల్సి ఉంది. కాగా 4.47 నిమిషాలకు ఆయన సభాస్థలికి చేరుకున్నారు. 4.54కు ప్రసంగం మొదలుపెట్టిన రేవంత్రెడ్డి జనాలు వెళ్లడం చూసి 5.11 నిమిషాలకు ప్రసంగం ముగించారు. ముఖ్యనేతలు వచ్చే సమయానికి సభా ప్రాంగణం వెలవెలబోతూ కనిపించింది. ప్రసంగించే సమయానికి 7 నుంచి 8 వేల మంది లేకపోవడం గమనార్హం. అంతకుముందు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రసంగిస్తుండగానే రేవంత్రెడ్డి సభకు రాడు అనే ఆలోచనతో కాంగ్రెస్ శ్రేణులు వందల సంఖ్యలో వెళ్లిపోయారు. నకిరేకల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని చెప్పేందుకు ఈ సభే సంకేతమని ప్రజలు చర్చించుకుంటున్నారు.