రాజాపేట, నవంబర్ 10 : రాజాపేట మండలం పారుపల్లి గ్రామంలోని వక్ఫ్ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరుతూ ముస్లిం మైనార్టీ నాయకులు సోమవారం భువనగిరిలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ అక్బర్ పాషా, మహమ్మద్ అస్గర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.