మోటకొండూర్ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం సుమారు 20నిమిషాల పాటు వర్షం దంచి కొట్టింది. దీంతో మండలంలోని మాటూరు, తేర్యాల గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. కాగా పలు లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరుకుంది. ఆయా గ్రామాల్లో స్వల్పంగా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వడగండ్ల వర్షం కురువడంతో ప్రజలు ఇండ్లకే పరిమితం కాగా చిన్నారులు వడగండ్ల వానలో ఉత్సాహంగా ఆడుకున్నారు.