హుజూర్నగర్టౌన్ : పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన పచ్చిపాల నర్సింహా కొన్ని నెలల క్రితం కాలువలో పడి ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో పార్టీ సభ్యత్వ సమయంలో చేసిన ఇన్సూరెన్స్ ద్వారా లభించిన చెక్కును మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లో ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు.
ఇబ్బందులు ఎదురైతే అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు అమర్నాధ్రెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, అమర్, ఉపేందర్, చంద్రమౌళి, మైసయ్య, కిరణ్, రవీందర్ పాల్గొన్నారు.