రామన్నపేట, నవంబర్ 04 : రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం పర్యావరణ హిత ఎకో బజారును నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు రాహత్ ఖానం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, పర్యావరణ పరిరక్షణ కలిగింపజేయాలన్న సంకల్పాన్ని పెంపొందింపజేయడం ప్రధాన ఉద్దేశ్యాలుగా ఈ ఎకో బజార్ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులచే వివిధ వస్తువులు, తినుబండారాలు, ప్లాస్టిక్ రహిత పదార్థాలతో కూడిన 16 స్టాళ్లను ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ పిండి వంటలను విద్యార్థులే స్వయంగా తయారు చేసి ఈ స్టాళ్లలో అమ్మినట్లు చెప్పారు. ఈ ఎకో బజార్ను స్థానిక పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు సందర్శించారు.
ఎకో బజార్కు విశిష్ట అతిథిగా విచ్చేసిన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు సి.జగదీష్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు చదువుతో పాటు మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉపాధిని పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ఐక్య ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు, పాలనాధికారి జి.కరుణాకర్, అధ్యాపకులు డాక్టర్ రత్న మంజుల, డాక్టర్ జి.సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్.వెంకట్ గౌడ్, డాక్టర్ డి.కిషన్, డాక్టర్ ఎం. బ్రహ్మం, డాక్టర్ ఎం.రవీందర్ రావు, డాక్టర్ ఆర్.శ్రీను, టి.శ్రీనివాస్, బాలరాజు, అమర్, నరేశ్, ఆంజనేయులు, రవి, రాధిక, విద్యార్థులు పాల్గొన్నారు.

Ramannapet : ‘విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యం, పర్యావరణ స్పృహ పెంపు లక్ష్యంగా ఎకో బజార్’