యాదగిరిగుట్ట, యాదాద్రి : శ్రీ స్వయంభూ పంచనారసింహ క్షేత్రముగా విరాజిల్లుతున్న యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం స్వామివారు ‘వటపత్రసాయి’ ( Vatapatra Sai) అలంకారంలో ఆలయ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు(Darsan).
స్వామివారు ప్రళయకాలములో పరమాత్మ బాలముకుందుడిగా మర్రి ఆకుపై పాలకడలిలో పవళించిన తీరు అపూర్వ ఘట్టమని అర్చకులు వెల్లడించారు. సాయంత్రం స్వామిని వైకుంఠనాథుడు(Vaikuntanathudu) అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. రామకృష్ణరావు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.