యాదాద్రి,భువనగిరి : యాదాద్రి (Yadadri) లో కొలువుదీరిన లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు యాదాద్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేసవి సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా గత మూడు రోజుల్లో్ రెండున్నర లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈనెల 24న 60వేల మంది భక్తులు దర్శించుకోగా వారు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 48.44 లక్షలు, 25న 75 వేల మంది రాగా 62.55 లక్షలు, ఆదివారం 81 వేల మంది భక్తులు రాగా రూ. కోటి 2 లక్షలు ఆదాయం(Income) వివిధ కౌంటర్ల ద్వారా ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కర్రావు తెలిపారు.
రాబోయే రోజుల్లో రద్దీకి అనుగుణంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులకు త్వరగా దర్శనం, ప్రసాదం వితరణ చేసేందుకు ప్రత్యేక, బ్రేక్ దర్శనాల టికెట్ల విక్రయాన్ని తగ్గించామని ఆయన వివరించారు .