యాదాద్రి, ఫిబ్రవరి 28 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేయాలని నల్లగొండ ఉమ్మడి జిల్లా డీసీబీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కోరారు. హైదరాబాద్లోని టెస్కాబ్ ముఖ్య కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశానికి హాజరైన నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులుకు టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో కలిసి వినతిపత్రం అందజేశారు.
నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కొత్త శాఖలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్బీఐ అధికారులతో మాట్లాడి కొత్త శాఖల మంజూరుకు చర్యలు తీసుకుంటామని నాబార్డు చైర్మన్ హామీ ఇచ్చినట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు.