యాదాద్రి భువనగిరి : నిన్న జనగాం సభలో నేను మాట్లాడితే.. బీజేపీ వాళ్లకు లాగులు తడిసినయ్.. అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లాలోని రాయగిరి సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు.
దేశంలో ఉన్న బీజేపీ మొగోళ్ళు నేను అడిగే దానికి సమాధానం చెప్పాలి. మోదీ తెలివి తక్కువతనం వల్ల ఇవాళ దేశం వెనక్కి పోతోంది. కేంద్ర ప్రభుత్వ లెక్కలే మీ డొల్లతనాన్ని బయట పెడుతున్నాయి. పంటలు పండిస్తే కొనే చేతకాదు. బీజేపీ జెండా ఎం చేస్తున్నది.. దేశాన్ని ఆకలి రాజ్యం చేస్తారా.. నీళ్లు, కరంట్ ఇచ్చే సోయి బీజేపీకి లేదు. కరోనా టైమ్లో గంగానదిలో శవాలు తేలాయి.. ఇది మోదీకి సిగ్గు చేటు. మోదీ తెలివి తక్కువతనం వల్లనే లాక్ డౌన్ పెట్టి ప్రజలను అరిగోస పెట్టించారు. తెలంగాణ సమాజం బీజేపీ దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పోరాటం చేద్దామా మీరే చెప్పండి.. ఢిల్లీ దాకా పోరాటం చేద్దాం పిడికిలి బిగిద్దాం.. కేసీఆర్ నోరు ఎత్తుకుంటే గడగడ లాడిపోతున్నారు బీజేపీ వాళ్లు. కేసీఆర్ ఏది మాట్లాడినా గట్టిగా మాట్లాడుతడు. నేను చచ్చినా తెలంగాణలో కేంద్రం కరెంట్ పాలసీలను అమలు చేసేది లేదు. ఏం చేస్తావో చేయ్ మోదీ.. బీజేపీ సంగతి అంతా దేశం అంతా వివరిస్తా. బీజేపీ వాళ్లు చేసిన స్కామ్లు అన్నీ నాకు తెలుసు. కేంద్రంలో గుంట నక్కల అవినీతిని ఎండ గడతా. బిడ్డ ఇక చూసుకో మోదీ నీ సంగతి చూస్తా.. అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.