యాదగిరి గుట్ట, భువనగిరి ( యాదాద్రి) : యాదాద్రి జిల్లాలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. వ్రతాలు, వాహన పూజలు, పుష్కరిణీలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఒక్కరోజే ఆలయానికి రూ. 62 లక్షల 31, 717 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు.
ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,06,250, కైంకర్యాల ద్వారా రూ. 6,500, సుప్రభాతం ద్వారా రూ. 10,800, బ్రేక్ దర్శనం వల్ల రూ. 4,04,100, వ్రతాల ద్వారా రూ. 13,56,800 ఆదాయం సమకూరిందని వెల్లడించారు. వాహన పూజల ద్వారా రూ. 23,200, వీఐపీ(VIP) దర్శనం ద్వారా రూ. 5,70,000, ప్రచారశాఖ ద్వారా రూ. 73,435, పాతగుట్టలో పూజల ద్వారా రూ. 2,21,020, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 8 లక్షలు వచ్చిందని వివరించారు.
యాదఋషి నిలయం ద్వారా రూ. 1,63,116, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,62,212, శివాలయం ద్వారా రూ. 19,300, పుష్కరిణీ ద్వారా రూ. 3,000, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 15,50,820 , శాశ్వత పూజలు ద్వారా రూ. 1,02,500, కల్యాణ కట్ట ద్వారా రూ. లక్షా, గోశాల ద్వారా రూ. 50వేలు, లీజేస్ లిగాల్ ద్వారా రూ. 2,84,675, అన్నదానం ద్వారా రూ. 23,989 ఆదాయం ఆలయానికి సమకూరిందని పేర్కొన్నారు.