బీబీనగర్ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్న దని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి అన్నారు. ఈ నెల 12న కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరి పట్టణానికి వస్తున్న సందర్భంగా బీబీనగర్ పట్టణంలోని ఫేమస్ ఫంక్షన్ హాలులో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్తో కలిసి కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక 2014 సంవత్సరం ముందు తరువాత ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు అర్దమవుతుందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, వంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేస్తలేరన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ ఐటి పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సహకారంతో బీబీనగర్ పట్టణాన్ని 7.5కోట్ల నిధులతో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, మండల వ్యాప్తంగా కూడా గ్రామాల్లో ఇప్పటికే 80శాతం అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామన్నారు.
సీఎం కేసీఆర్ సారద్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే, ఇంత అభివృద్ధి జరుగక పోయేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్గౌడ్, జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్ జడ్పీటీసీ గోలి ప్రణితా పింగళ్రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేష్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, కార్యదర్శి చింతల సుదర్శన్రెడ్డి, కార్యకర్తలు, ఉద్యమకారులు, పాల్గొన్నారు.