యాదగిరిగుట్ట, యాదాద్రి : యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా భాస్కర్ రావు (Bhaskar Rao) బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను డిప్యూటేషన్(Deputation) పై ఆలయ ఈవోగా నియమిస్తూ దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ(Principal Secretary) శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్రావు శనివారం ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల సీఎం, మంత్రుల పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో ప్రస్తుత ఇన్చార్జి ఈవో రామకృష్ణారావును బదిలీ చేశారు.