యాదాద్రి: ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదల వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. పుట్టిన పాప నుంచి వృద్దురాలి వరకు ప్రతిఒక్కరికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయం అందేలా కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మాసాయిపేట, లప్పనాయక్ తండా, మైలారీగూడెం, మల్లాపురం గ్రామానికి చెందిన 12 మందికి రూ. 3,06,500 విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి కింద 12 చెక్కులు మం జూరు కాగా బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరంలా మారిందన్నారు. కార్పొరేట్ దవాఖానల్లో సైతం నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా ఈ పథకం తోడ్పాటునిస్తుందన్నారు. ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అను రాధ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు అంకం నర్సింహ్మా, జిన్నా మాదవరెడ్డి, మిట్ట వెంకటయ్య, మిట్ట అరుణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.