భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 6 : ప్రజలంతా చట్టాలపై అవగాహన పెంచుకుని నేర రహిత సమాజానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బాలభాస్కర్రావు సూచించారు. మండలంలోని అనంతారం గ్రామంలో ఆదివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చట్టాలపై, న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని, పిల్లలతో పనులు చేయిస్తే చట్ట ప్రకారం రూ.లక్ష జరిమానా, రెండేండ్ల జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. భూ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం-2007 ప్రకారం తల్లిదండ్రుల బాగోగులు పిల్లలు తప్పనిసరిగా చూడాలని కోరారు. న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం చట్టాలపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పారా లీగల్ వాలంటీర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందం మల్లికార్జున్, రూరల్ ఎస్ఐ రాఘవేందర్, ఎంపీటీసీ సామల వెంకటేశ్, ఉపసర్పంచ్ విఠల్ వెంకటేశ్, కార్యదర్శి నర్సింగ్రావు, ప్యానల్ అడ్వకేట్ శంకర్, పారా లీగల్ వాలంటీర్లు కొడారి వెంకటేశ్, కానుగంటి శ్రీశైలం, బాలేశ్వర్, మండల న్యాయ సేవాధికార సంస్థ బాధ్యులు నర్సింహారావు, వార్డుసభ్యులు, వీబీకే పద్మ, అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి, సూపర్వైజర్లు మహిళలు, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.