యాదాద్రి, ఆగస్టు 18 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం ఘనంగా జరిపించారు. అంతకుముందు సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు.
స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. వారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ, తిరువారాధన ఘనంగా నిర్వహించారు. స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు.
రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. శ్రావణమాసం సందర్భంగా యాదగిరిగుట్టలో చేపట్టిన ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ కార్యక్రమం ఘనంగా కొనసాగుతున్నది. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ.17,99,954 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
మహారాష్ట్రలోని రత్నగిరి కవి కులగురు కాళిదాస్ సంస్కృత విశ్వ విద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో వైటీడీఏ ఉప స్తపతి మోతీలాల్ పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ పాండురంగా వామన్ కనే సంస్కృత కేంద్రం సంయుక్తంగా ధర్మం, ధర్మశాస్త్రం, సంస్కృతి, దేవాలయ సంస్కృతీ, సంప్రదాయాలు అనే అంశాలపై ఈ నెల 17, 18తేదీల్లో కాన్ఫరెన్స్లో పాల్గొని ఆర్కిటెక్చర్ ఆఫ్ యాదగిరిగుట్ట అనే అంశంపై ప్రసంగించారు. కాన్ఫరెన్స్లో పలు దేశ, విదేశాలకు చెందిన 250మందికి పైగా స్కాలర్స్ పాల్గొన్నారని తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,54,100
వీఐపీ దర్శనాలు 45,000
వేద ఆశీర్వచనం 13,200
నిత్య కైంకర్యాలు 2,801
సుప్రభాతం 1,100
క్యారీబ్యాగుల విక్రయం 11,500
వ్రత పూజలు 1,72,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 30,000
ప్రసాద విక్రయం 8,64,750
వాహనపూజలు 10,800
అన్నదాన విరాళం 1,16,445
సువర్ణ పుష్పార్చన 81,032
యాదరుషి నిలయం 56,336
పాతగుట్ట నుంచి 32,990
కొండపైకి వాహన ప్రవేశం 1,50,000
శివాలయం 3,800
శాశ్వత పూజలు 15,000