యాదాద్రి, జూన్ 1 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు బుధవారం శాస్ర్తోక్తంగా నిత్య కైంకర్యాలు నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనం పురవీధుల్లో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపించారు. మొదటగా స్వామికి సుదర్శన నారసింహ హోమం చేశారు. స్వామి నిత్యపూజలు వేకువజామున 3.30గంటలకు ప్రారంభమయ్యాయి. స్వయంభువులను ఆరాధించి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు చేశారు.
అనంతరం లక్ష్మీనర్సింహులను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేశారు. శ్రీ పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సత్యనారాయణ స్వామివారి వత్ర పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ.20,73,303 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి సేవలో ఎమ్మెల్సీ ప్రభాకర్రావు
శ్రీవారిని ఎమ్మెల్సీ ప్రభాకర్రావు కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.