చౌటుప్పల్, మే16 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న ఉద్యోగ అర్హత పరీక్షల్లో అధిక మార్కులు సాధించేందుకు నిరుద్యోగ యువతీయువకులు కష్టపడి చదువాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని భవాని ఫంక్షన్హాల్లో చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోరాట పటిమను యువతీయువకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ చూపిన తెగువ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్ష 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించిందని, ఈ దఫా మరో 85 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. యువత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం సాధించడం సులువే అన్నారు. ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని, కోచింగ్ తీసుకుంటున్న వారికి మెస్ చార్జీలు, మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, నారాయణపురం ఎంపీపీ, జడ్పీటీసీ గుత్త ఉమాదేవి, వీరమళ్ల భానుమతి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండలాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్రెడ్డి, గిర్కటి నిరంజన్గౌడ్, ప్రధాన కార్యదర్శులు ఢిల్లీ మాధవరెడ్డి, గుండెబోయిన వెంకటేశ్యాదవ్, యూత్ అధ్యక్షుడు నారెడ్డి అభినందన్రెడ్డి, తొర్పునూరి నర్సింహగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్, జిల్లా కమిటీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.