యాదాద్రి భువనగిరి, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : వీధి కుకల దాడుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘కుకలు భౌ బోయ్’ కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాసర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వీధి కుకల బెడద అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కుకల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాటిని బంధించి, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కుకకాటు ద్వారా వ్యాపించే రెబీస్ వ్యాధిని నివారించేందుకు వీధి కుకలకు యాంటీ రెబీస్ టీకాలు వేయాలని ఆదేశించారు. కుకల సంతతిని నియంత్రించేందుకు పెద్దఎత్తున స్టెరిలైజేషన్ (జనన నియంత్రణ) ఆపరేషన్లు చేపట్టాలన్నారు.
ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో వీధి కుకలను గుర్తించి వాటికి స్టెరిలైజేషన్ చేయడం అత్యవసరమన్నారు. ముఖ్యంగా జనాభా ఎకువ ఉండే చోట క్రమం తప్పకుండా డ్రైవ్ నిర్వహించి కుకలకు స్టెరిలైజేషన్ చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ అధికారి సరిత, పశుసంవర్థక శాఖ అధికారి జానయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా వైద్యశాఖ అధికారి మనోహర్, జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.