కేతేపల్లి, జనవరి 19 : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు గురువారం అధికారులు రెండో విడుత నీటిని విడుదల చేశారు. యాసంగి పంటల సాగుకు గత నెల రెండో వారం నుంచి సుమారు నెల రోజులు మొదటి విడుత నీటిని వదిలారు.
10 రోజుల విరామం తర్వాత తిరిగి రెండో విడుత నీటిని వదిలారు. రెండు కాల్వలకు కలిపి 410 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ ఉదయ్ తెలిపారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు కాగా, ప్రస్తుతం 638.75(2.94 టీఎంసీలు)అడుగులుగా ఉంది. ఎగువ నుంచి 216.48 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.