నకిరేకల్, డిసెంబర్ 30 : మండలంలోని నోముల గ్రామంలో పందుల షెడ్డును తొలగించాలని శుక్రవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పందులు ఇళ్లల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని, వాటితో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని గ్రామస్తులు ఆరోపించారు.
అధికా రులు స్పందించి పందుల షెడ్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.