నందికొండ, డిసెంబర్ 21 : నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనాన్ని వియత్నాం దేశానికి చెందిన హునిం బౌద్ధ ప్రధాన బౌద్ధాచార్యుడు తిచ్మిన్ థాంగ్ ఆధ్వర్యంలో 130మంది బౌద్ధ భిక్షువులు బుధవారం సందర్శించారు. బుద్ధవనంలో బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశా రు. అనంతరం బుద్ధవనం, జాతకపార్కు, అవకాన బుద్ధ, మహాస్థూపం, ధ్యానమందిరం సందర్శించారు. ఈ సందర్భంగా తిచ్మిన్ థాంగ్ మా ట్లాడుతూ బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందుతుందని, ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేలపైన నిర్మించిన ఈ బుద్ధవనం తెలంగాణ రాష్ర్టానికి మణిహారంగా నిలుస్తుందని అన్నారు.
ప్రపంచంలోని వివిధ బౌద్ధ నమూనాల శిల్పాలను ఒకే చోట చూడడం చాల సంతోషంగా ఉందని తెలిపారు. బౌద్ధ వారసత్వ పర్యాటక కేంద్రంగా బుద్ధవనాన్ని తీర్చిదిద్ధిన బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యను యన అభినందించారు. పురావస్తు నిపుణులు, బౌద్ధ పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి బుద్ధవనం విశేషాలను వివరించాడు. అంనంతరం బౌద్ధభిక్షువులు నాగార్జునకొండను సందర్శించారు. వారితో బుద్ధవనం ఓఎస్డి సుధాన్రెడ్డి, ఎస్ఈ క్రాంతిబాబు, సహాయకశిల్పి శ్యామ్ బుద్ధవనం సిబ్బంది నర్సింహ ఉన్నారు.