నల్లగొండ: పార్టీ పట్ల విధేయత ఉండి పార్టీ అభివృద్ధి కోసం పాటు పడే వారికి పదవులు దక్కుతాయని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పరిశీలకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. స్థానిక శాసన సభ్యుడి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఆదివారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎంపీ బడుగు ల లింగయ్యయాదవ్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ వార్డు నుంచి మండల స్థాయి వరకు కమిటీలను ఎన్నుకోవటానికి పరిశీలకులుగా వెళ్లే వారు అక్కడి నేతల పనితనం, స్థానికుల అభిప్రాయాలు తీసుకోని నిత్యం పార్టీ అభివృద్ధి కోసం పాటు పడే వారినే ఎన్నుకోవాలని సూచించారు.
పార్టీ అనేది కన్నతల్లి లాంటిదని పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్లను మాత్రం కమిటీల్లో తీసుకోవద్దని సూచించారు. ప్రధా నంగా పదవుల కోసం ఆరాట పడే వాళ్లకు మాత్రం పార్టీ పదవులు ఇవ్వోద్దని..పార్టీ అభివృద్ధి కోసం పాటు పడ్డవాళ్లకు ఏదో ఒక సమయంలో పదవి వస్తుందన్నారు.
అక్టోబర్ రెండో తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్కు పునాదిరాయి పడనుం దని అదేరోజున ఇక్కడ జండా పండుగ నిర్వహిం చి కమిటీల నియామకాలు చేపట్టాలని అన్నారు. అక్టోబర్ రెండు నుంచి 12 వరకు గ్రామ స్తాయిలో, పార్టీ , అనుబంధ సంఘాల కమిటీలను ఎన్నుకోని 13 నుంచి 20వరకు మండల, పట్టణ స్థాయిలో కమిటీలను పూర్తి చేయాలన్నారు.
ఇందుకుగాను పరిశీలకులుగా ఒక మండలం నుంచి మరో మండలానికి పంపిస్తామని అన్నారు. అయితే కమిటీలో 51 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు అవకాశం కల్పించాలని అన్నారు. ఆ తర్వాత జిల్లా కమిటీలను ఎన్ను కుంటామన్నారు. అనంతరం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ పార్టీని కాపాడితేనే మనని పార్టీ కాపా డుతందనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు.
పార్టీ సంస్థాగతంగా ఎంత పటిష్టంగా ఉంటే అంతే స్థాయిలో ఎన్నికలను ఎదుర్కోని మరో సారి అధికారంలోకి వస్తుందని అన్నారు. పార్టీ గురించి చెడుగా మాట్లాడే వారికి పదవుల్లో అవకాశం కల్పించొద్దని, పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యక్తులకే పార్టీ పదవులు అప్పగిస్తామని అన్నారు. కమిటీల విషయంలో పరిశీలకులు చిత్తశుద్ధితో పవ్యవహరించి అక్కడి కార్యకర్తల సలహాలు, అభిప్రాయాలు తీసుకోని ఎన్నుకోవాలని సూచించారు.
పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ క్రమశిక్షణతో ఉన్న వ్యక్తులకే తన వద్ద ప్రాధాన్యత ఉంటుందన్నారు. అనంతరం నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాలతో పాటు పట్టణం నుంచి పరిశీలకుల కోసం 50 మంది చొప్పున మొత్తం 200 మందిని ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్, ఎంపీపీలు కరీంపాష, నాగుల వంచ విజయలక్ష్మి, జడ్పీటీసీ వెంకటేశం, అభిమన్యు శ్రీనివాస్,
కటికం సత్తయ్య గౌడ్, బక్క పిచ్చయ్య, ఫరీదుద్దీన్, సింగం రామ్మోహన్, మైనం శ్రీనివాస్, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట రెడ్డి, అయితగోని యాదయ్య, పాశం సంపత్ రెడ్డి, వంగాల సహదే వ రెడ్డి, ఆలకుంట్ల నాగరత్నం రాజు తదితరులు పాల్గొన్నారు.