అన్నా చెల్లెళ్లు… అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలను ఆదివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరపుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి తన సోదరి, ఐసీడీఎస్ ఆర్వో మాలే శరణ్యారెడ్డి, టీఆర్ఎస్ నాయకురాళ్లు సంకు ధనలక్ష్మీలు రాఖీలు కట్టారు.
దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్కు దేవరకొండ జడ్పీటీసీ మారుపాకుల అరుణగౌడ్, పెద్దఅడిశర్లపల్లి మండల వైస్ ఎంపీపీ ఆర్వపల్లి సరితలు రాఖీలు కట్టారు.
నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కట్టంగూర్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు రాఖీలు కట్టారు. హైదరాబాద్లోని నివాసంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పెర్కకొండారం ఎంపీటీసీ భీనబోయిన పుష్ప రాఖీ కట్టారు.