బొడ్రాయిబజార్, డిసెంబర్ 8 : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ పేరిణి నృత్యకారుడు రాజ్కుమార్ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారానికి ఎంపికయ్యారు.ఇటీవల రాష్ట్ర స్థాయిలో పేరిణి నృత్య ప్రదర్శనను ప్రదర్శించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. దాంతో భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ రాజ్కుమార్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా రాజ్కుమార్ను హైదరాబాద్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ తంగెడ కిషన్రావు, రిజిస్ట్రార్ బట్టు రమేశ్, డీఎస్ హనుమంతరావు, హెచ్ఓడీ వనజ, ఉదయ్ శాలువా షీల్డ్తో సత్కరించి అభినందించారు. రాజ్కుమార్ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల కళాభిమానులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.