నార్కట్పల్లి: మూత్ర విసర్జన కోసం వెళ్లి కళ్ళు తిరిగి డ్రైనేజీలో పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని ఏపీ లింగోటం 65వ నంబర్ జాతీయ రహదా రిపై ఆదివారం జరిగింది. ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ బోయపల్లికి చెందిన రేవూరి నరేశ్(48) చెల్లెలు విజయవాడలో ఉంటుండడంతో అక్కడికి వెళ్లి రాఖీ
కట్టించుకొని తిరిగి హైదరాబాద్కు వస్తుండగా మార్గమధ్యలో ఏపీ లింగోటం శివారులో మూత్ర విసర్జన కోసం రోడ్డు ప్రక్కన డ్రైనేజీ వద్దకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా కళ్లు తిరిగి డ్రైనేజీలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.