మర్రిగూడ: ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టిన పనులు, బిల్లుల చెల్లింపుల వివరాలను గ్రామపంచాయితీ రికార్డుల్లో పూర్తిగా నమోదు చేయాలని కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయ సీఏవో టీ.శేషుకుమార్ అధికా రులకు సూచించారు. స్థానిక ఎన్ఆ ర్ఈజీఎస్ కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శులకు, ఈజీఎస్ అధికారులతో జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న ఉపాధి పనులను తనిఖీ చేసేందకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం పర్యటించే అవకాశం ఉందన్నారు. రికార్డుల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చ రించారు. అంతకుముందు మండల కేంద్రంలో నిర్మించిన డంపింగ్యార్డులను, పలుచోట్ల ఉపాధి పనులను, హరితహారం మొక్కలను పరిశీలించారు. సమావేశంలో ఎంపీడీవో రమేశ్ దీన్దయాల్,ఎంపీవో ఝాన్సీరెడ్డి, ఈసీ వివేక్, కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.