రామగిరి, డిసెంబర్ 27: మహాత్మాగాంధీ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా నల్లగొండలోని నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల కార్యదర్శి, ప్రిన్సిపాల్ మారం నాగేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండలో బుధవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీసీ ప్రకాశ్, కేజీ టు పీజీ విద్యా సంస్థల రాష్ట్ర కన్వీనర్ గింజల రమణారెడ్డి సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు.
ఉపాధ్యక్షులుగా బి.శంకర్(నలంద డిగ్రీ కళాశాల, చౌటుప్పల్), సీహెచ్. సత్యం గౌడ్ (సంతోషి డిగ్రీ కళాశాల, మోత్కూర్), ఎం.వెంకట్రెడ్డి (హసిత డిగ్రీ కళాశాల, మిర్యాలగూడ), ప్రధాన కార్యదర్శిగా ఎం.సైదారావు (సిద్ధార్థ డిగ్రీ కళాశాల, సూర్యాపేట), సంయుక్త కార్యదర్శులుగా జి.రాజశేఖర్రెడ్డి (భవిత డిగ్రీ కళాశాల, దేవరకొండ), వి,.శంకర్(వినాయక్ డిగ్రీ కళాశాల సూర్యాపేట), ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎస్.హన్మంతు యాదవ్(భారతి డిగ్రీ కళాశాల, మాల్), కోశాధికారిగా డి.ప్రవీణ్(సాయికృప డిగ్రీ కళాశాల, భువనగిరి) ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి.సూర్యనారాయణరెడ్డి, ఎస్.ఆదిత్యసామ్రాట్, కె.రామ్మోహన్, ఎం.సుభాశ్రెడ్డి, పి.భాస్కర్రావు, టి.శ్రీనివాస్రెడ్డి ఎంపికయ్యారు.