బీబీనగర్, డిసెంబర్ 18 : మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం సందర్శించారు. ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేసేందుకు ఎయిమ్స్లో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, క్యూఆర్ కోడ్, ఈ సంజీవని కార్యక్రమాలను ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. ఆస్పత్రి ఆవరణలో ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా 101 మొక్కలను నాటారు. ఎయిమ్స్ ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, మెడికల్ సూపరింటెండెంట్ నీరజ్అగర్వాల్, డీన్ డాక్టర్ రాహుల్నరంగ్, అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్ఓ డాక్టర్ శ్యామల పాల్గొన్నారు.