రామగిరి, మే 17 : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలీసెట్ 2023 ప్రవేశ పరీక్ష బుధవారం నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగిన పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,005 మంది విద్యార్థులకు 8,238మంది హాజరయ్యారు.
నల్లగొండలో పరీక్షలను రీజినల్ కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.జానకిదేవి, సూర్యాపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్.నర్సింహారావు, యాదాద్రిభువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యాదగిరిగుట్ట ప్రిన్సిపాల్ పీయాజ్ అక్తర్ పర్యవేక్షణ చేశారు.