గుండాల, జూలై 20 : బీజేపీ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వాసవీ గార్డెన్స్లో బుధవారం ఏర్పాటు చేసిన మండల యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నదని విమర్శించారు. జూట మాటలతో కేంద్రంలో అధికారంలోకొచ్చి ప్రజలను ఇబ్బందులకు చేస్తున్నదన్నారు. గతంలో రూ.380 ఉన్న గ్యాస్ ధరను ప్రస్తుతం రూ.1160కి పెంచి ప్రజలను దోచుకుంటుందన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతుందన్నారు. పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలపై 5శాతం జీఎస్టీ పెంచడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శమన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, ఎవరేం చేసినా మళ్లీ సీఎం కేసీఆరే ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టబోతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గుండాల మండలానికి చేసిందేమీ లేదని అన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఆలేరు నియోజకవర్గంతో పాటు గుండాల మండలానికి అనేక నిధు లు కేటాయించి అభివృద్ధి చేసిందన్నారు. అనంతరం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన చింతకింది సోమయ్యకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.1.50లక్షల ఎల్ఓసీ అందించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎండీ.ఖలీ ల్, ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మీరాములు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు రావుల హరితాదేవి, సంగి వేణుగోపాల్, జిల్లా నాయకులు బండ రమేశ్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు మోజెస్, చెన్నారెడ్డి, అండెం మమత, యూత్ అధ్యక్షుడు రంజిత్రెడ్డి, విద్యార్థి సంఘం అధ్యక్షుడు దయాకర్, నాగరాజు పాల్గొన్నారు.
పార్టీలో పనిచేసే వారికి తగిన ప్రాధాన్యం
పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఎన్డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. గుండాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.
నిరుపేదలకు కొండంత అండ సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట రూరల్ : రాష్ట్రంలో నిరుపేదలకు కొండంత అండగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకందుకూరు గ్రామానికి చెందిన ఎర్ర పరుశరాములు అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.2లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించి స్వయంగా ఇంటికెళ్లి అందించారు.