మత్య్సకారులకు సర్కారు చేయూత
సభ్యత్వంతో ప్రభుత్వ పథకాలకు అర్హత
ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో 15 వేలు,
నల్లగొండలో 22వేల మందికి సభ్యత్వం
ఈ నెల 20 వరకు నమోదుకు అవకాశం
సూర్యాపేట అర్బన్, మే 14 : మత్య్స సహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 20 వరకు అర్హత కలిగిన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది మత్య్సకారులు ఉండగా ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా కొత్తగా మరో 2-3 వేల మందికి ప్రయోజనం కలుగనున్నది. అలాగే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 22 వేల మంది సభ్యులు ఉండగా మరో 2 నుంచి 3 వేల మంది కొత్తగా అవకాశం దక్కనుంది.
సంఘాల ఏర్పాటుకు అవకాశం
మత్స్యకారులకు అవసరమైన సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక డ్రైవ్లో అవకాశం కల్పించింది. జిల్లాలోని చాలా గ్రామాల్లో చెరువుల విస్త్రీర్ణం ఉండి సంఘాలు లేని మత్స్యకారులకు నూతన సంఘాల ఏర్పాటుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సభ్య త్వం కోసం సభ్యులు ఏ సంఘం పరిధిలో స భ్యత్వం అవసరమో ఆ సంఘం సర్వసభ్య స మావేశం ఏర్పాటు చేసి జిల్లా కార్యాలయంలో అందించాలి. సంఘాల ఏర్పాటుకు మత్స్యకారులు ఆధార్కార్డులు, బ్యాంకు అకౌంట్ వివరాలు, చెరువుకు సంబంధించిన విస్తీర్ణం పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.