చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నాయకుడు.. అందుకే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బీజేపీ 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నా ఈ పథకాలు ఇచ్చే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి అన్నారు. 57 సంవత్సరాలు నిండిన పేదలందరికీ ఆసరా పింఛన్ అందిస్తున్నారని తెలిపారు. గతంలో 3.6లక్షల మందికి పింఛన్లు ఇవ్వగా.. ఇప్పుడు మరో 10లక్షలు అదనంగా పెంచినట్లు చెప్పారు.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. దళితులకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందించి వారు 40 రకాల వ్యాపారాలు చేసుకునేలా అవకాశం ఇచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రూ.22వేల కాంట్రాక్టులకు అమ్ముడు పోయాడని, బీజేపీకి ఓటేస్తే వ్వవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో సర్పంచులు మునగాల ప్రభాకర్రెడ్డి, బచ్చ రామకృష్ణ, నాయకులు మల్లేశ్ యాదవ్, ముత్తిరెడ్డి, ఆగిరెడ్డి, లింగస్వామి, మల్లేశ్, రాంరెడ్డి, భూపాల్రెడ్డి, బాబురావు, రాజు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
మండలంలో పర్యటించిన ఇన్చార్జి ఎమ్మెల్యేలు
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 7 : రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మునుగోడు టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు కోసం వివిధ గ్రామాలకు నియమించిన ఎమ్మెల్యేలు శుక్రవారం ఆయా గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులతో సమావేశమమై పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. లచ్చమ్మగూడెం, చిల్లాపురం, డాకుతండా, కొర్ర తండాలో గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. అనంతరం పుట్టపాకలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గుజ్జ గ్రామ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 10మంది టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు.
పుట్టపాకలో ఎమ్మెల్యే కోరుట్ల విద్యాసాగర్రావు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే శంకర్నాయక్ పల్లగట్టుతండా, వాచ్యాతండా, గంగమూలతండా, కడపగండి తండాలో ఇంటింటి ప్రచారం చేశారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా ఆధ్యక్షుడు రామకృష్ణారెడ్డి సంస్థాన్ నారాయణపురంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 10మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. ఓటు అడిగే నైతిక హక్కు సైతం ప్రతిపక్షాలకు లేదని, ప్రజలందరూ టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ళ భానుమతి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా నాయకుడు జీ.ప్రేమ్చందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి, దోనూరి జైపాల్రెడ్డి, వెంకటేశం, శ్రీహరి, ఆడెపు సురేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నోముల భగత్
బోడంగిపర్తిలో కాంగ్రెస్కు చెందిన 20కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక
చండూరు, అక్టోబర్ 7 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వలసలు కొనసాగుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని బోడంగిపర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20కుటుంబాల వారు శుక్రవారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో చెదురుపల్లి ఈదయ్య, యాదయ్య, ప్రవీణ్, శ్రీశైలం, భరత్స్వామి, వెంకన్న మహేశ్, జగదీశ్, శివ, సునీల్, వీరస్వామి, సతీశ్, నాగరాజు ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మాధవీవెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, కట్కూరి సత్తయ్య, పందుల భిక్షం, వరికుప్పల సురేశ్, రామలింగయ్య, ముత్యాలు పాల్గొన్నారు.
కొరటికల్లో పలువురి చేరిక
మునుగోడు : మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన పలువురు యువకులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండవాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఐతగోని శివ, పల్లపు ప్రసాద్, పెంబల గణేశ్, మాల్గి లింగస్వామి, భగత్, బోడిశ మధు, శ్రవణ్, శివశంకర్, అయితగోని స్వామి, మిర్యాల మహేశ్ ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల ఉపాధ్యక్షుడు మందుల సత్యం, చండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిళ్ల వెంకట్రెడ్డి, ఉపసర్పంచ్ ఎల్లంకి యాదగిరి, సీనియర్ నాయకుడు లక్ష్మయ్య, సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ ఎల్లంకి శ్రీశైలం పాల్గొన్నారు.