నల్లగొండ, అక్టోబర్ 5 : టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. వీటీ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీ(టీ)ఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు జమాల్ఖాద్రి, మాలె శరణ్యారెడ్డి, దుబ్బ రూప, దోనాల నాగార్జునరెడ్డి, సిరిగిరి సురేశ్రెడ్డి పాల్గొన్నారు.
మిర్యాలగూడలో..
మిర్యాలగూడ : పట్టణంలో పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, టీఆర్ఎస్ యువనాయకుడు నల్లమోతు సిద్ధార్థ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పెద్ది శ్రీనివాస్గౌడ్, అన్నభీమోజు నాగార్జునాచారి, యల్దండ లింగారెడ్డి, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, మట్టపల్లి సైదులు, ఎండీ.షోయబ్, శ్రీనివాస్యాదవ్, ఏడుకొండలు, పి.లక్ష్మీనారాయణ, దినేశ్, చాంద్పాషా పాల్గొన్నారు.
సాగర్ నియోజకవర్గంలో..
హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. హాలియా, త్రిపురారం, పెద్దవూరలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆ పార్టీ నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. హాలియాలోని సాయి ప్రతాప్నగర్లో బీ(టీ)ఆర్ఎస్ నాయకుడు దుబ్బ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో బీహార్ కూలీలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎడమకాల్వ మాజీ వైస్ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ సలహాదారు వెంపటి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, వర్రా వెంకట్రెడ్డి, దోరేపల్లి వెంకటేశ్వర్లు, సురభి రాంబాబు, బందిలి సైదులు, వడ్డె సతీశ్రెడ్డి, మాదనబోయిన నరేందర్రావు, అన్వరొద్దీన్, సైదాచారి, మొగలయ్య, త్రిపురారంలో నిడమనూరు మార్కెట్ మాజీ చైర్మన్ కామర్ల జానయ్య, నాయకులు అనుముల శ్రీనివాస్రెడ్డి, మర్ల చందారెడ్డి, జంగిలి శ్రీనివాస్ యాదవ్, చింతకాయల యాదయ్య, కొల్లి రాము, బాతుపు నాగయ్య, అవిరెళ్ల సైదులు, దస్తగిరి, నగిరి శ్రీను, పెద్దవూరలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, షేక్ అబ్బాస్, మిట్టపల్లి ప్రదీప్రెడ్డి, వెంకట్రెడ్డి, మెండే సైదులు యాదవ్, అహ్మద్ అలీ, శ్రీకర్నాయక్ పాల్గొన్నారు.
దేవరకొండలో సంబురాలు
దేవరకొండ : పట్టణంలోని మీనాక్షి హోటల్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, వైస్ చైర్మన్ రహత్ అలీ, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, బీ(టీ)ఆర్ఎస్ నాయకుడు హన్మంత్ వెంకటేశ్గౌడ్, పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, బీ(టీ)ఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.