త్రిపురారం: కల్యాణలక్ష్మి నిరుపేదలకు అందించే వరమని, అధికారులు, మధ్యవర్తులు డబ్బులకు ఆశ పడి లబ్ధిదారుల ను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని నాగా ర్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 66 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం రూ.1, 00,116 చెల్లిస్తుందని, అధికారులు గానీ, మధ్య వర్తులు గానీ లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. ఎవ రైనా డబ్బులడిగినా.. కల్యాణలక్ష్మి ఫైల్స్ ఆపినా నేరుగా హాలియాలోని తన నివాస గృహానికొచ్చి సంప్రదించాలన్నారు.
కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ ప్రమీల, సర్పంచ్ అనుముల శ్రీనివాస రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, మాద ధనలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
వాటర్ట్యాంకులకు శంకుస్థాపన
త్రిపురారం మండలంలోని మర్రిగూడెం, దుగ్గేపల్లి గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంకులను గురువారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ శంకుస్థాపన చేశారు. ఒక్కో ట్యాంకు లక్షా 20 వేల లీటర్ల సామర్థ్యం గల రెండు మంచినీటి ట్యాం కులను రూ.22 లక్షల చొప్పున నిర్మించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బహునూతల నరేందర్, మాద ధనలక్ష్మి, రామచంద్రయ్య,, అనంత రెడ్డి, వెంకటేశ్వర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు పద్మ శ్రీనివాస్, చిలుక స్వప్న, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.