సంస్థాన్ నారాయణపురం మండలంలోని మారుమూల గిరిజన తండాకు చెందిన విద్యార్థి క్యాంపస్ ప్లేస్మెంట్లో జపాన్ దేశంలోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఆ దేశ రాజధాని టోక్యోలోని యోకోగావా ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కంపెనీలో ఇంజినీర్గా ఎంపికయ్యాడు. అక్కడ 45 రోజుల ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చాడు. చేరేందుకు సోమవారం రాత్రి జపాన్కు బయల్దేరాడు ఆంగోతు తండాకు చెందిన ఆంగోతు ప్రశాంత్నాయక్.
సంస్థాన్ నారాయణపురం మండలం ఆంగోతు తండాకు చెందిన ఆంగోతు మధునాయక్ – సుజాత దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె. వారి కుమారుడు ప్రశాంత్నాయక్ చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్లోని శ్రీచైతన్య పాఠశాలలో చదివాడు. 2019లో జేఈఈ మెయిన్స్లో ఆలిండియా 467వ ర్యాంక్, జేఈఈ అడ్వాన్స్లో ఆలిండియా 245వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. హైదరాబాద్లోని ఐఐటీలో సీటు సాధించి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో చేరాడు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగానే 2022 జూలైలో క్యాంపస్ ప్లేస్మెంట్లో జపాన్ దేశ రాజధాని టోక్యోలో ఉన్న యోకోగావా ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఇంజినీర్గా ఎంపికయ్యాడు. జపాన్లో ఉద్యోగానికి ఎంపిక కావడంతో ప్రశాంత్నాయక్ తల్లిదండ్రులు, తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జపాన్లో ఏడాదికి రూ.75లక్షల జీతానికి ఇంజినీర్గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉన్నది. చిన్నతనం నుంచి సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని చదివా. ఎన్ని కష్టాలు పడైనా సరే ఏదో ఒకరోజు కచ్చితంగా సివిల్స్ సాధిస్తా.