రామగిరి, డిసెంబర్ 29 : నల్లగొండలోని చర్లపల్లిలో నిర్వహిస్తున్న ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ గురువారం కొనసాగింది. 14 అంశాల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు హోరాహోరీగా జరిగాయి. శుక్రవారం ముగింపు ఉంటుందని నిర్వాహకుడు కొలనుపాక రవికుమార్ వెల్లడించారు.
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఈఓ భిక్షపతితోపాటు ప్రముఖులు హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తారని తెలిపారు.