తిప్పర్తి: నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసిన రైతు ఉత్తత్తి దారుల సహకార సంఘం ద్వారా రైతులు ఎరువులు, విత్త నాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలో రైతు ఉత్తత్తిదారుల సహకార కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ సభ్యులుగా చేరి నాబార్డు రుణం తీసుకొని రైతు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.
ఈ సంఘం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను,ఎరువులు అందజేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ సంఘం ద్వారా రైతులకు గేదెలను కూడా సరఫరా చేస్తే పాల ఉత్పత్తి రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ఆర్గానిక్ ఎరువులు అందుబాటులో ఉంచి రైతుల నాణ్యమైన సరుకులు ఇవ్వాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఉన్యానవన అధికారి అనంతరెడ్డి, ఎవో సన్నిరాజు, నాయకులు సుంకరి మల్లే శ్ గౌడ్, సిరిగిరి వెంకట్రెడ్డి, కందుల లక్ష్మయ్య, గుర్రం వెంకట్రెడ్డి, సిరసవాడ సైదులు, తదితరులు పాల్గొన్నారు.