కరువు ప్రాంతమైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో జల సిరులు పారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన దీనిని రూ.6,500 కోట్లతో పనులు చేపట్టింది. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద ఐదు రిజర్వాయర్లు (సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం) చేపడుతున్నారు. ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సింగరాజుపల్లి, గొట్టిముక్కల రిజర్వాయర్లు 95 శాతం పూర్తి కాగా, శివన్నగూడెం 60, చింతపల్లి, కిష్టరాంపల్లి 35 శాతం పనులు పూర్తయ్యాయి. ఇవి పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.50 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి.
– దేవరకొండ, జూలై 3
దేవరకొండ, జూన్ 28 : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పరిధిలోనే అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ 6,500 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగరాజ్పల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం ప్రాజెక్టుల పనులు చేపడుతున్నారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.50 లక్షల ఎకరాల సాగులోకి నీరు అందనున్నాయి. ఈ రిజర్వాయర్ల పనులు పూర్తి చేస్తే దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుంది. డిండి ప్రాజెక్టుతో ప్రస్తుతం 1.075 టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్తో 12 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా డిండిని పూర్తి స్థ్ధాయిలో నింపి డిండి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు, డిండి ప్రాజెక్టుతో చందంపేట, నేరేడుగొమ్ము మండల్లోని చెరువులను నీటిని నింపారు. వేసవి కాలంలో ఎక్కడ చూసినా చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నది
నాలుగేండ్లుగా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు
డిండి మండలంలోని డిండి ప్రాజెక్టును స్వాతంత్య్రం రాకముందే ప్రాజెక్టును నిర్మించారు. పురాతన ప్రాజెక్టు కింద ప్రస్తుతం 12,000 వేల ఎకరాలు భూములకు సాగు నీరు అందుతుంది. నాలుగేండ్లుగా కృష్ణ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురువడంతో డిండి ప్రాజెక్టులోకి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని డిండి ప్రాజెక్టులోకి వదులుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నాలుగేండ్లుగా ప్రాజెక్టులోకి పూర్తి స్థాయి నీటిని నింపి డిండి ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు నీరు ఇస్తున్నారు.
సింగరాజ్పల్లి రిజర్వాయర్
డిండి మండలంలోని సింగరాజ్పల్లి రిజర్వాయర్ 0.056 గల సామర్థ్యం గల రిజర్వాయర్ పనులు ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయకట్టు ద్వారా 6,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు వ్యయం అంచ నా విలువ రూ.435 కోట్లు నిధులతో పనులు చేపట్టారు.
గొట్టిముక్కల రిజర్వాయర్
దేవరకొండ మండలం గొట్టిముక్కల సమీపంలో నిర్మిస్తున్న గొట్టిముక్కల రిజర్వాయర్ సామర్థ్యం 1.075 టీఎంసీలు. ప్రాజెక్టు పనులు 95 శాతం పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్ కింద సాగులోకి సుమారు 10 వేల ఎకరాల భూములు సాగులోకి వస్తున్నది. మండలంలోని సుమారు 39 గ్రామాలకు సాగు నీరు అందుతూ, భూగర్భ జలాలు బోరు, బావుల్లో నీరు పెరుగుతుందని. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.490 కోట్లు తో పనులు చేపట్టారు. రిజర్వాయర్ కట్ట పనులు పూర్తయి మెయిన్ గేట్లు పనులు పూర్తి చేశారు.
కిష్టరాంపల్లి రిజర్వాయర్
చింతపల్లి మండలంలోని కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తే సుమారు 2,500 ఎకరాలు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.435 కోట్లు వ్యయంతో పనులు చేపడతున్నారు. 35 శాతం పనులు పూర్తయ్యాయి. రిజర్వాయర్ పనులు పూర్తయితే చింతపల్లి మండలంలో రెండు రిజర్వాయర్లతో సాగులోకి వస్తాయి.
శివన్నగూడెం రిజర్వాయర్
మర్రిగూడ మండలం శివన్నగూడెంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యం 11.97 టీఎంసీలు. ప్రాజె క్టు పూర్తయితే 1.46 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 1500 కోట్లతో పనులు చేపట్టారు. దాదాపుగా 60 శాతం పనులు పూర్తయ్యాయి.
చింతపల్లి రిజర్వాయర్
చింతపల్లి మండలంలో రిజర్వాయర్ పూర్తి చేస్తే సుమారు 6,500 ఎకరాల భూములు సాగులోకి వస్తాయి. రిజర్వాయర్ 0.86 టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.456 కోట్లు నిధులతో పనులు చేపడుతున్నారు. 30 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయితే చింతపల్లి సమీపంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందనుంది.