యాదాద్రి భువనగిరి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని హైటెక్స్లో మూడు రోజులపాటు నిర్వహించిన థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రదర్శన పోచంపల్లి చేనేత కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పోచంపల్లి ఇకత్ వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వేదికగా నిలిచింది.
చేనేత కళ, సంప్రదాయం, సంసృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల సమ్మేళనంగా కొనసాగింది. చేనేత కళాకారులకు ప్రత్యక్ష మారెట్ అవకాశాలు, వినియోగదారులతో నేరుగా అనుసంధానం, పోచంపల్లి ఇకత్ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు, గ్రామీణ చేనేత కళాకారుల ఆదాయం పెంపు, మహిళా చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశం.
రూ.6.5 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు
మూడు రోజుల పాటు జరిగిన ఈ భారీ ప్రదర్శనను సుమారు 8500 మంది సందర్శకులు తిలకించారు. హైదరాబాద్తోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు పోచంపల్లి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్రదర్శన ముగిసే నాటికి మొ త్తం రూ.6.5 కోట్ల వ్యా పార లావాదేవీలు నమోదయ్యాయి.