ఇంటర్మీయట్ ఫలితాల్లో సర్కారు కళాశాలల విద్యార్థులు సత్తాచాటారు. ప్రైవేటుకు ఏమాత్రమూ తగ్గకుండా మంచి ఫలితాలు సాధించారు. గురుకులాలు, ఆదర్శ, కస్తూర్బా కళాశాలలు ఏవైనా ప్రభుత్వం కల్పించిన వసతులు, నాణ్యమైన విద్యను వినియోగించుకొని రాణించారు. ఉమ్మడి జిల్లాలో గురుకుల విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. ప్రథమ సంవత్సరంలో 77.43 శాతం, ద్వితీయ సంవత్సరంలో 88.92శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో 22 మంది విద్యార్థులు టాప్టెన్లో నిలిచారు. మొత్తంగా నల్లగొండ జిల్లాలో ఫస్టియర్లో 54(13వ స్థానం), సెకండియర్లో 64(12వ స్థానం).. సూర్యాపేట జిల్లాలో ఫస్టియర్లో 51(26వ స్థానం), సెకండియర్లో 59(31వ స్థానం)శాతం మంది పాస్ అయ్యారు. బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణత పొందారు.
– రామగిరి/సూర్యాపేట అర్బన్, మే 9
నల్లగొండ, మే 9 : రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భోజనం, వసతి కల్పించి నాణ్యమైన విద్య అందజేస్తున్న గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సాధారణంగా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలను పరిగణలోకి తీసుకుంటే ఫస్టియర్లో 54శాతం ఉత్తీర్ణత రాగా.. గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు 73.43శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తంగా 64శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. గురుకుల విద్యార్థులు 88.92శాతం మంది పాసయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వర్గాలకు సంబంధించి 62 గురుకుల కళాశాలలు ఉన్నాయి. అందులో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఆయా విభాగాల్లో 3,718 మంది పరీక్ష రాయగా 2,879 (77.43శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్లో 3,875 మంది పరీక్ష రాయగా 3,446 (88.92శాతం) మంది పాసయ్యారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బీసీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన చిలుకూరి కీర్తి 467 మార్కులు సాధించి స్టేట్లో రెండో స్థానంలో నిలిచింది. బీసీ గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో టాప్ టెన్లో 15 ర్యాంకులు రాగా.. మైనార్టీ, ట్రైబల్, ఎస్సీ వెల్ఫేర్లో మరో పది ర్యాంకులు వచ్చాయి.
మెరిసిన బీసీ విద్యార్థినులు
మోటకొండూర్, మే 9 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకుల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్లో 79, సెకండియర్లో 85శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. సెకండియర్ బైపీసీలో సాత్విక 979, ఎంపీసీలో మనీష 973, సాహితి 970, సీఈసీలో నిహారిక 943 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో దివ్వశ్రీ 459, హాసిని 451, ఆకాంక్ష 451, బైపీసీలో భానురేఖ 426, అనూష 424, సీఈసీలో పల్లవి 408 మార్కులు సాధించారు.
రాష్ట్ర స్థాయిలో సర్వేల్ గురుకుల విద్యార్థుల ప్రతిభ
సంస్థాన్ నారాయణపురం : ఇంటర్మీడియట్ ఫలితాల్లో సర్వేల్ గురుకుల కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఫస్టియర్లో 155మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 156 మందికి 155 మంది పాసయ్యారు. సెకండియర్ ఎంపీసీ విభాగంలో శివారెడ్డి 988 మార్కులు, బైపీసీలో భాను 982, ఎంఈసీలో మల్లికార్జున్ 980 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో ఐదుగురు విద్యార్థులు 466 మార్కులు సాధించారు. బైపీసీలో ఆర్.దినేశ్ 437, ఎంఈసీలో పవన్సాయిరెడ్డి 489 మార్కులు సాధించారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ సతీశ్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో సెకండియర్లో 119 మందికి 67 మంది విద్యార్థులు పాసయ్యారు. సెకండియర్ ఎంపీసీలో దినేశ్ 971 మార్కులు సాధించాడు.
రాజాపేట గురుకుల విద్యార్థుల సత్తా
రాజాపేట, మే 9 : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల సెకండియర్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఎంపీసీలో చరణ్కుమార్ 978 మార్కులు, రామోజీ 968, బైపీసీలో నరేందర్ 977, రాజ్కుమార్ 976, ఫస్టియర్ ఎంపీసీలో భానుప్రసాద్ 459, వెంకటేశ్నాయక్ 458 మార్కులు సాధించారు.
నందికొండ బీసీ గురుకులం, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు
నందికొండ : బీసీ గురుకులం, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్పిపాల్స్ రజినీకాంత్, పాండయ్య తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అజయ్ 985, బైపీసీలో వంశీ 977, ఎంఈసీలో ఆసిఫ్ 967, సీఈసీలో మహేశ్ 956మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో రేవంత్ 460, బైపీసీలో రాంబాబు 408, ఎంఈసీలో నవీన్గౌడ్ 443, సీఈసీలో అవినాశ్ 459 మార్కులు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్ ఎంపీసీలో గాయత్రి 935, ఈసీహెచ్లో సారాబేగం 784, ఎంఎల్టీ లక్ష్మీదేవి 937, సీఎస్లో మైనుద్దీన్ 866, ఏఅండ్టీలో ముత్యాలు 834, ఫస్టియర్ ఎంపీసీలో త్రినయని 452, ఎంఎల్టీలో పగిడి లలిత 469, సీఎస్లో చందన 447, ఏఅండ్టీలో కోటయ్య 429, మార్కులు సాధించారు.
ఆలేరు మైనారిటీ గురుకులంలో 95శాతం ఉత్తీర్ణత
ఆలేరు, మే 9 : ఆలేరు పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాల విద్యార్థులు 95శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ ఎండీ జహీరున్నీసా తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు బి.శ్రీవాణి 458, బి.రేణుక 457, కె.కావ్య 454, బైపీసీ విభాగంలో 440 మార్కులకు ఎస్.మిత్ర 423, పి.పావని 470 మార్కులు సాధించారు. సెకండియర్లో ఎంపీసీ విభాగంలో జి.గీతాంజలి 1000/961, ఎస్కే సాదియాహుస్సేన్ 946, బైపీసీ విభాగంలో కె.శృతి 1000/960, యు.రమ్య 945మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
డివిజన్ టాపర్లుగా ఎస్టీ గురుకుల విద్యార్థులు
కొండమల్లేపల్లి, మే 9 : ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థులు డివిజన్ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. సెకండియర్ ఎంపీసీ విభాగంలో ఎం.శ్వేత 979, బి.సంధ్య 972, ఫస్టియర్లో బి.వాణి 455, ఇ.సరిత 454 మార్కులతో డివిజన్ స్థాయి టాపర్లుగా నిలిచారు. దీంతోపాటు ఎస్సీ గురుకుల కళాశాల విద్యార్థులు డి.నిఖిత 941, ఆర్.శిరీష 919 మార్కులు సాధించారు.
ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల సత్తా
భూదాన్ పోచంపల్లి : ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో ఏలె హర్షిత 983, కూరపాటి సాయికీర్తన 973, బీసీ గురుకుల పాఠశాలకు చెందిన కె.హరినాథ్ 980, ఎస్.సాయికిరణ్ 969 మారులు సాధించారు.
మోడల్ స్కూల్ విద్యార్థినికి 981 మార్కులు
శాలిగౌరారం, మే 9 : మండలంలోని వల్లాల మోడల్ స్కూల్ విద్యార్థిని వైష్ణవి సెకండియర్ ఎంపీసీలో 981 మార్కులు సాధించింది. బైపీసీలో పి.తేజస్విని 966, రేవతి 890 మార్కులు, సాధించినట్లు ప్రిన్సిపాల్ రాగిణి తెలిపారు. ఫస్టియర్లో 103మంది విద్యార్థులకు 36 మంది, సెకండియర్లో 108మందికి 59మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.
సూర్యాపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ఉత్తమ ప్రతిభ
సూర్యాపేట అర్బన్ : ఇంటర్మీడియట్లో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 15 మంది 950కి పైగా మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ యాదయ్య తెలిపారు. ద్వితీ య సంవత్సరం బైపీసీలో కొమ్ము ప్రశాంతి 979, ఎంపీసీలో కర్నాటి స్వాతి 923, సీఈసీలో లక్ష్మీవినీల 878, ఒకేషనల్లో బొడ్డు నిఖిల్ 957 మార్కులు సాధించినట్లు చెప్పారు. ఫస్టియర్ సీఈసీలో వినయ్ 462, ఒకేషనల్లో శంకరాచారి 485 మార్కులు సాధించారన్నారు.
ఎస్సీ గురుకులంలో 95శాతం ఉత్తీ ర్ణత
మఠంపల్లి : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు 95శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో రాపోలు స్నేహ 457, బైపీసీలో పిడమర్తి శివాని 392, సెకండియర్ ఎంపీసీలో బత్తిని తేజశ్రీ 984, సాగా సాయితేజశ్రీ 965 మార్కులు సాధించారు.
ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
నిడమనూరు, మే 9 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో పాశం ఝాన్సీ 406, ద్వితీయ సంవత్సరం బీపీసీలో కొప్పెర రమ్య 960 మార్కులు సాధించి మిర్యాలగూడ డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. సెకండియర్ బీపీసీలో గాదె అంజలి 940, వై.మనీష 939, ఇందు 938, నీరుటి శిరీష 930, బెజవాడ రమ్యశ్రీ 918, ఎంపీసీ విభాగంలో యాతం యామిని 932, కాట్నం శ్రీవల్లి 931, బొజ్జనబోయిన పావని 928, బి.శివ 915, విజయలక్ష్మి 908, సోమగాని జ్యోత్స్న 902, ఎంఈసీ విభాగంలో నర్సింగ్ అఖిల 887, గన్నెపాక పల్లవి 854 మార్కులు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ రంజిత అభినందించారు.
మోడల్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
గుండాల, మే 9 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండల కేంద్రంలోని మోడల్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. సెకండియర్ ఎంపీసీలో వి.వర్ష 939, బైపీసీలో టి.దివ్య 977, సీఈసీలో డి.అశ్విని 792, ఎంఈసీలో ఆర్.సందీప్ 627 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో బి.పూజ 437, బైపీసీలో పి.రాఘవ 388, సీఈసీలో కె.స్వాతి 298 మార్కులు సాధించారు.