బొమ్మలరామారం, మార్చి 23 : స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి విడుతగా ఎంపికైన మైలారంకిందితండా ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులకు రూ.8.45 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాలలో గ్రీన్ బోర్డులు, ఫ్యాన్స్, డెస్క్ బెంచీలు, మరుగుదొడ్లకు మరమ్మతులు, గోడలపై ఆకర్షణీయమైన పెయింటింగ్, కొత్త డోర్లు, విండోలు, ప్రహరీ నిర్మాణం, గేటు, కిచెన్ షెడ్డు మాడిఫికేషన్, బిల్డింగ్ లీకేజీ వంటి పనులను పూర్తి చేశారు. తాగునీటి కోసం ఓవర్హెడ్ ట్యాంక్, హ్యాండ్వాష్ బేసిన్ ఏర్పాటు చేశారు. పాఠశాల గదులకు రంగులు వేశారు. ఇలా సకల సౌలత్లతో పాఠశాల కొత్తరూపు సంతరించుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు రాత్రివేళ పాఠశాల ఆవరణలో మద్యం తాగి సీసాలు పడేసేవారు. ఇప్పుడు ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేయడంతో ఆ సమస్యకు చెక్పడింది. విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తొలిగిపోయాయి. పాఠశాల కొత్తగా కనిపిస్తుండడంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడుతున్నారు.
-జంగిటి గోవర్ధన్, ప్రధానోపాధ్యాయుడు
పాఠశాలలో వాటర్ ఫిల్టర్, ఓవర్హెడ్ ట్యాంక్, హ్యాండ్వాష్కు నల్లాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తీరినయ్. అన్నం తినడానికి ముందు హ్యాండ్వాష్కు తగినంత నీరు అందుబాటులో ఉంటుంది. పాఠశాలలో డెస్క్ బెంచీలు, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయడంతో పాఠశాల కొత్తగా కనిపిస్తుంది. పాఠశాల ఆవరణ మొత్తం పరిశుభ్రంగా మారింది. -ధీరావత్ అక్షిత, 5వ తరగతి
Thehas launched the Mana Uru-Mana Badi program with an aim to ensure that public schools are properly managed.